Listen to this article

జనం న్యూస్ జూన్ 12 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమకమైనందున మర్యాదపూర్వకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, తో డిసిసి నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రా గౌడ్, లు కలిసి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి రావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ,కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, బాపూరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, సాజిద్, ఆంజనేయులు,బాబు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.