

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,జూన్ 11,అచ్యుతాపురం:
ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు. రైతులకు రాయితీపై విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా పరికరాలు అందించడమే లక్ష్యమన్నారు. డ్రోన్ల సాయంతో ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులను సులభతరం చేసుకుంటున్నారని చెప్పారు.రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతు దేశానికి వెన్నెముకలాంటివారని అభిప్రాయపడ్డారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు,రైతులు, కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.