Listen to this article

భూ భారతి చట్టం 2025,భూ సమస్యల పరిష్కారం కోరకై గ్రామ గ్రామన రెవెన్యూ సదస్సులు. ఎమ్మార్వో సుజాత

జనం న్యూస్,జున్ 11 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండల పరిధిలోని కండ్లపెల్లి కమ్మనూర్ గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి చట్టం 2025 ప్రకారం రైతు సోదరులు తరచుగా భూ సమస్యల కొరకు తిరిగి వేసారకూడదన్న సదుద్దేశంతో,గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.భూ భారతి చట్టం 2025 ద్వారా రైతుల యొక్క సమస్యను తెలుసుకొని సత్వర పరిష్కారం చేసే దిశగా గ్రామ రెవిన్యూ సదస్సులను నిర్వహించి పరిష్కరిస్తున్నామని ఎమ్మార్వో సుజాత , డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు.భూ అవకతవకల విషయంలో భూ యజమానులు మీ సమస్యల సర్వ ఆధారాలతో వచ్చినట్లయితే సమస్య పరిష్కరించడానికి ఇబ్బంది కాకుండా ఉంటుందని అన్నారు. గతంలో మాన్యువల్ గా రాసే రికార్డును కంప్యూటరికరణ చేసేటప్పుడు చిన్నచిన్న ఒడిదొడుకులు జరిగి ఉంటే భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రికార్డులను సరి చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అర్ ఐ ఎమ్ శ్రీనివాస్ ఎమ్ రాహుల్ జూనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్ సౌజన్య తాజా మాజీ సర్పంచ్ లు మాజీ ప్రజాప్రతినిధులు రైతులు నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.