Listen to this article

జనం న్యూస్ జాన్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

నెల్లూరు జిల్లా కాగుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు అయిన మణి,సరోజ తమ ఇద్దరు చిన్న పిల్లలను లను జనగామ జిల్లాకు చెందిన బొగ్గు బట్టి వ్యాపారి బొగ్గు బట్టి లో పని కోసం తీసుకొచి నెలన్నర రోజులపాటు వీరితో పని చేయించుకొని వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేయగా, ఎవరికి చెప్పుకోలేని ఈ అమాయకులు తమ దగ్గర డబ్బులు లేకపోవడం తో తమ ఇద్దరు పిల్లలతో జనగామ నుండి కాలినడకన తమ సొంత గ్రామం అయిన నెల్లూరు జిల్లాకు వెళ్తుండగా. సూర్యాపేట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నటువంటి మొగిలిచర్ల నరేష్ తమ గ్రామం అయిన విజయరాఘవపురం కి వెళ్తుండగా మునగాల మండలం మాధవరం గ్రామ సమీపం లో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఈ మని కుటుంబాన్ని చూసి విషయాన్ని తెలుసుకొని రెండు రోజులు నుండి అన్నం తినలేని ఆ చిన్నారుల బాధను చూసి తమ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించి వారి యొక్క దారి ఖర్చులకు భోజనాలకు కావలసిన అవసరాన్ని గుర్తించి తమ గ్రామం అయిన విజయ రాఘవపురం వాట్సప్ గ్రూప్ లో తెలియచేయగా గ్రామస్థులు స్పందించి తమ ఆర్థిక సహయం మొత్తం పదివేలు రూపాయలు సేకరించి మణి కుటుంబానికి ఇచి తమ సొంత ఊరికి పంపించడం జరిగింది.ఇట్టి సహాయము చేయడం లో గ్రామనికి చెందిన కల్నల్ శ్రీను, సీఐ ఆరే శ్రీధర్,అలువాల మధు,సుంకరి నవీన్,ఆరే శ్రీనివాస్,ప్రసాద్ తమ తోడ్పాటు అందించడం జరిగింది.ఇది మాత్రమే కాదు విజయరాఘవపురం గ్రామం లో ఎందరికో పేద పిల్లలకు ఆర్థికంగా లేనివారికి చదువుకునే పిల్లలకు ఈ గ్రామ ప్రజలు,ఉద్యోగస్తులు, పెద్దలు ఎన్నోసార్లు మేము ఉన్నాము అని ముందుకి వచి తమ వంతు సహాయం చేయడం జరిగింది.