Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 11

పాఠశాలలు జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతున్నందున పాఠశాలలో పనిచేస్తున్న వంట వాళ్లకు ప్రధానోపాధ్యాయులకు కాంప్లెక్స్ స్థాయిలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏనుకూరు కాంప్లెక్స్ పరిధిలో ఈరోజు జడ్పిహెచ్ఎస్ ఏన్కూర్ లో నిర్వహించారని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే సైదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య వ్యవహరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మధ్యాహ్నభోజన పథకం కార్యక్రమంలో వంట వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు పాటించే పద్ధతులు మరియు నియమాలను వివరించడం జరిగింది. ఆ తర్వాత స్లైడ్స్ ద్వారా ఆకుకూర పప్పు, కిచిడి ,వెజ్ బిర్యానీ ,సాంబారు ఎలా వండా లో చూపించారు.పాఠశాల ఆవరణలోని వంటగదిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, గోపి వెంకటప్పయ్య, హతి రామ్, రామచంద్, వెంకటేశ్వర్లు, నిర్మల్ కుమార్ ,రామకృష్ణ ,చంద్రిక, మాధవి ,దివ్య, వెంకటేశ్వరరావు ,వంట సిబ్బంది నిర్మల ,యశోద ,మంగమ్మ, కమల, నాగమణి, సైదాబీ, రేణుక, జ్యోతి, విజయ, మరియమ్మ, వెంకటరత్నం, బుజ్జి ,సి ఆర్ పి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.