Listen to this article

అధికారుల హామీతో ధర్నా విరమించిన మహిళలు

జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో బుధవారం మహిళలు కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ వరదరాజ్ పూర్ గ్రామంలో దాదాపు రెండు నెలలుగా మిషన్ భగీరథ మీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు, కాగా ఈ విషయం తెలుసుకున్న మండల ఎంపీడీవో, ఎంపీవో ప్రభుత్వ అధికారులు వరదరాజ పురం గ్రామానికి చేరుకొని, నీటి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.