Listen to this article

జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ మండలంలోని చోర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని గ్రామ మాజీ ఉప సర్పంచ్ చీట్ల.నారాయణ గ్రామ కార్యదర్శి తిరుపతి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి బుధవారం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ను అందజేసి, బేస్మెంట్ కోసం ముగ్గులు వేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఉప – సర్పంచ్ చిట్ల. నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కల ఆశయాన్ని సహకారం చేసినందుకు గాను ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని అన్నారు. బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు, గ్రూప్ లెవెల్ స్థాయి దాటిన తర్వాత లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయ్యాక రూ 2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన లక్ష రూపాయలతో కలిపి ఇలా మొత్తం రూ.5 లక్షలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తోందన్నారు.