

బడి బాట పట్టిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 11జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
జైనూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు.జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో బుధవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యా యులతో కలిసి పాల్గొన్న సుగుణక్క విద్యార్థులకు పలకలు, చాక్లెట్లు, అరటి పళ్ళు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని, విశాలమైన తరగతి గదులు ఉంటాయని, ఆడుకోవడానికి మైదానాలు, తెలుగు, ఆంగ్లంలోనూ విద్యాబోధన ఉంటుందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని హాస్టళ్లలో విద్యార్థులందరికీ కామన్ డైట్ మెనూను అమలు చేస్తుందని,గత ప్రభుత్వ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలకు వసతి సౌకర్యం, భవన నిర్మాణాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు షేక్ ముఖిద్,మాజీ సర్పంచ్ కనక ప్రతిభ,మండలం నాయకులు..మండడి లింగు, కనక గంగారాం,ప్రకాష్,అజ్జు లాల, గోపీచంద్,దౌలత్ రావ్, సిదేశ్వర్,ఉపాధ్యాయులు కనక సోనేరావ్,మండడి సోనేరావ్, ఆడ సెద్మా రావ్, కనక వెంకటేశ్వర్ రావ్, ఆత్రం మాణిక్ రావ్,గ్రామ పటేల్ భగవంత్ రావ్,దేవారి కనక కొద్దు, హైమన్ డార్ఫ్ యూత్ సభ్యులు జూగ్నక్ ధర్మేందర్,అకోష్ తదితరులు పాల్గొన్నారు.
