Listen to this article

జనం న్యూస్ జూన్ 12 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం ఇ ముంపునకు గురువుతున్న అటవీ భూములకు అటవీ శాఖ తోపాటు కేంద్రం పర్యావరణ అనుమతి రావాల్సి ఉందని. ఇందుకు సమయం పడుతుందని ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్ అప్ ఫారెస్ట్ ( పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి బీరు పూర్ శివారులోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం లో అటవీ శాఖ భూములు 800 ఎకరాలు ముంపునకు గురువుతున్నాయని ఇంజనీరింగ్.అటవీశాఖ అధికారులు వివరించారు ప్రాజెక్టు సమీపంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ఫారెస్ట్ అభయారణ్యం ఉందని ఇందుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వారి వెంట చీప్ కన్జర్వేటర్ శర్వానంద్ డీఎఫ్ లో రవి ప్రసాద్ ఈఈ నారాయణరెడ్డి డీఈ చక్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు