Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 12)

దౌల్తాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల బంగారం గ్రామంలో పాఠశాల పున ప్రారంభం మొదటి రోజున విద్యార్థులకు అంగరంగ వైభవంగా స్వాగతం పలికామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ అన్నారు బడి ప్రారంభం మొదటి రోజున కాబట్టి పిల్లలు చాలా ఆనందంగా ఆకర్షణీయంగా ఉండడానికి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాల నడిపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.