Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 12)


ఈరోజు పాఠశాల పున :ప్రారంభం రోజున ప్రాథమిక పాఠశాల దొమ్మాటలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు పాఠశాల నిర్వహణ తల్లిదండ్రుల భాగస్వామ్యం మనమందరము సమన్వయంతో పని చేస్తేనే పాఠశాల నిర్వహణ విజయవంతంగా ముందుకు సాగుతుంది విద్యార్థులకు 100% న్యాయం చేయగలుగుతానని దీనికి తల్లిదండ్రుల సహకారం కూడా తప్పకుండా ఉండాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సర్దార్ హుస్సేన్, సుధాకర్ రెడ్డి, నిర్మల, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ యాదమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.