Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాలనీ నందు ఉన్న మద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా వెంకట నగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నగేష్ నియామిక పత్రాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య, పల్నాడు జిల్లా యువజన అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మద్దుల వెంకట కోటయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అతి త్వరలో కమిటీలు పూర్తిచేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వెంకట నగేష్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను బీసీల పట్ల ఎక్కడ ఏ సమస్య వచ్చినా నా వంతు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీల రథసారథి కొండ్రముట్ల నాగేశ్వరరావు , గుంజి బాజీ , రాచపూడి వెంకట్, సాయితేజ, చొప్ప వీరనారాయణ, నక్క వెంకటేష్ గుంజి బాలసుబ్రమణ్యం, మరి కొంతమంది బీసీ నాయకులు పాల్గొన్నారు