

జనం న్యూస్ 12జూన్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
హుస్నాబాద్ :ప్రపంచ శాంతి, భారత దేశ క్షేమం అభివృద్ధి కోసం హుస్నాబాద్ పట్టణ కేంద్రం లోని వెంకటేశ్వర గార్డెన్ లొపాస్టర్లు క్రైస్తవ భక్తులు బుధవారం 12గంటల ఉపవాసం ఉండి,జీసస్ కు గానాలు ఆలపించి, కన్నీటి ప్రార్ధన లు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం పాస్టర్ ల యొక్క అసోసియేషన్ అధ్యక్షులు సొలొమోన్ రాజ్ మాట్లాడుతూ ప్రపంచశాంతి, దేశ క్షేమంతో పాటు పలు చర్చించడంతో పాటు ప్రత్యేక ఉపవాసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఈ వర్ష కాలంలో వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు కు ఉపవాస ప్రార్థన లు చేసి వేడుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం లొ సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివ్వయ్య, నాయకులు పల్లపు రాజు, సత్యనందం, పాండు తో పాటు పాస్టర్లు బెన్ని, ప్రకాష్ రెడ్డి, ఇస్సాక్, మోసెస్, సమిల్ రెడ్డి, డేవిడ్, ఇజ్రాయెల్ క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు.