

ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు
పట్టించుకోని జిల్లా అధికారులు
జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
జైనూర్ :మండలంలోని చింతకర్ర,తాడిగూడ,కిషన్ నాయక్ తండా,లొద్దీగూడ గ్రామానికి వెల్లే ప్రధాన దారి బురదమయంగా పెద్ద పెద్ద గుంతల రాళ్లుగా మారింది. ఆదివాసీ గ్రామాలైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులు తమ గ్రామాలకు వెళ్ళాలంటే నరకయాతన అనుభవిస్తన్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కెరామెరి ఘాట్ రోడ్డు నుంచి తాడిగూడ, చింతకర్ర,కిషన్ నాయక్ తండా గ్రామానికి వెళ్ళాలంటే రోడ్డు పూర్తిగా బురదతో నిండిపోయి ఉండటంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్ళ లేని పరిస్థితి ఉందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కిషన్ నాయక్ తండా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు
