Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

సంవత్సర కాలంగా ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించకుండా విద్యార్ధులను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.మోసానికి గురైన విద్యార్ధులకు, యువతకు బాసటగా నిలిచే క్రమంలో పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, విద్యార్ధి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి, వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించడమైనది. పల్నాడు జిల్లా పరిధిలోని యువజన, విద్యార్ధి విభాగ నాయకులను సమన్వయం చేసుకొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. నర్సరావుపేట లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర నుంచి పాదయాత్ర గా వెళ్లి పల్నాడు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరుగును కందుల శ్రీకాంత్ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు