Listen to this article

దీక్ష భూమి లో గౌరవ డాక్టరేట్ పొందిన కమలాకర్ కు సన్మానం

జనం న్యూస్ జూన్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దీక్ష భూమి వద్ద ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్ ను సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించి, పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ డివిజన్ అధ్యక్షులు జాడి రవి దాస్, కార్యదర్శి నైతం కిరణ్ మాట్లాడుతూ సామాజిక రంగంలో గౌరవ డాక్టరేట్ పొందడం అభినందనీయమన్నారు. సమాజానికి సేవ చేయడం ద్వారా గుర్తింపు దానంతట అదే వస్తుంది అనడానికి కమలాకర్ నిదర్శనం అని అన్నారు. నిరంతరం గ్రామస్థాయి వరకు కమలాకర్ సమాచార హక్కు చట్టంపై, మానవ హక్కులపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, చట్టాలపై మరియు సైబర్ మోసాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి యువకులకు విద్యార్థులకు సేవా కార్యక్రమాలు ఆదర్శమని అన్నారు. సమాజం కొరకు కష్టపడే వ్యక్తికి సరియైన గుర్తింపు డాక్టరేట్ తో రావడం సహ చట్టం సభ్యులందరికీ సంతోషకరమని అన్నారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు దుర్గం సుధాకర్, మాన్కరే జనార్ధన్,చునర్కర్ శ్రీకాంత్, డి.వై.ఏఫ్.వై జిల్లా అధ్యక్షులు గేడం టీకనంద్, స్వేరో మండల నాయకులు గోలేటి నగేష్ తదితరులు పాల్గొన్నారు