

జనం న్యూస్ :12 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా జనసేన పార్టీ క్రియశిలా సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి సభ్యత్వ కిట్ లు ఐడి కార్డులు జనసేన పార్టీ యూత్ రాష్ట్ర సెక్రటరీ,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. జనసేన పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ సిద్దిపేట నియోజికవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది,ఈ సందర్బంగా దాసరి పవన్ మాట్లాడుతూ పోటీ చేసిన 21 శాసనసభ 2 పార్లమెంట్ స్థానాలతో వంద శాతం స్ట్రెయిక్ రేట్ తో భారత దేశం లో ఏ పార్టీ సాధించని రికార్డ్ కేవలం జనసేన పార్టీ,పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమైందన్నారు,తెలంగాణ లో ని సిద్దిపేట నియోజికవర్గం లో పెద్ద ఎత్తున జనసేన పార్టీ క్రియశిలా సభ్యత్వం చేసుకోవడం చూస్తుంటే పార్టీ కి పెరుగుతున్న ఆదరణనే ఇందుకు నిదర్శనమన్నారు కార్యకర్తలు ప్రమాద వశత్తు మరణిస్తే 5లక్షలు, ప్రమాదం జరిగి గాయపడితే యాభై వెయ్యిల రూపాయల ప్రమాదభీమా దేశం లో ఏ పార్టీ చేయనిది మొట్టమొదట పవన్ కళ్యాణ్ ఆలోచన తో జనసేన పార్టీ ప్రవేశ పెట్టిందన్నారు రానున్న రోజులలో సిద్దిపేట నియోజకవర్గం లో అధికార ప్రతి పక్ష పార్టీలకు దీటుగా ఎదుగుతూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామన్నారు.రాజీవ్ యువ వికాస్ కు అప్లై చేసుకున్న వారికీ అతి తొందరగా ఎటువంటి కోర్రిలు లేకుండా మంజూరి చేయాలనీ అలాగే అర్వులైన పేదలందరికి రేషన్ కార్డు లను వెంటనే మంజూరు చేయాలన్నారు.. ఈ కార్యక్రమం లో నాయకులు బండిపల్లి కృష్ణ. గొడుగు శివ,
బాల్ రత్నం మోరర్కర్ సాయి,భాను చందర్,మల్లేశం. కృష్ణ.పర్శరాములు,బాలు,అఖిల్. హరీష్. హరి. శ్రీను.కార్యకర్తలు పాల్గొన్నారు.