

జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
మార్కుక్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల గంగాపూర్ గత ఏడు సంవత్సరాల కాలంగా మూతబడినది. గత ఐదు రోజులుగా బడిబాట లో బాగంగా గ్రామ తల్లిదండ్రుల, మహిళ సమాఖ్య సభ్యులు, ప్రముఖులతో మాట్లాడి ఈ రోజు పాఠశాల ను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు పాఠశాల లో పదమూడు మంది విద్యార్థులు చేరినారు. దీనిని కొనసాగించడానికి అన్ని సౌకర్యాలు కల్గించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం కు రాష్ట్ర పరిశీలకులు రాష్ట్ర పరీక్షల సంచాలకులు అయిన కృష రావు, జిల్లా అధికారి రంగనాత్ స్వామి, మండల విద్యాధికారి వెంకట రాములు, మాజీ ఎంపీటీసి కృష , తల్లిదండ్రుల ఇతర గ్రామ ప్రముకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.రాష్ట్ర పరిశీలకులు ప్రభుత్వ బడులు మళ్ళీ ఈ విధంగా తెరుచుకోవడం చాలా అభినందనీయమని, దీనిని కొనసాగించడానికి అందరు సహకరించాలన్నారు. మండల విద్యాధికారి వెంకట రాములు ,మార్కుక్ పాఠశాల కు కావలసిన విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, మద్యాన్హ్ బోజనం,అందిస్తామన్నారు.