Listen to this article

జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

జగదేవపూర్ మిత్రమా నేనున్నా నీకు అంటూ నువ్వు అధైర్యపడొద్దని అండగా ఉంటా అని తన తోటి మిత్రుడు చెక్కల మహేష్, రమేష్,కు భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రమేష్, 4 రోజుల క్రితం రోడ్ ప్రమాదంలో గాయాలై ఆస్పత్రిలో చేరారు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా రమేష్, ఆర్థిక పరిస్థితుల వల్ల, డబ్బులు లేక ఇబ్బంది స్థితిలో ఉన్న రమేష్ ను తన తోటి మిత్రుడు చెక్కల మహేష్. గురువారం హాస్పటల్ కి వెళ్లి తన మిత్రుని పరామర్శించి అనారోగ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన ఫ్రెండ్ కి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం ఆస్పటల్ నిమిత్తం ఖర్చులకు ₹ 10,000/- రూ.ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చెక్కల మహేష్, మాట్లాడుతూ నాతోటి మిత్రుడు రమేష్, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు నా మిత్రునికి అండగా ఉంటానని పేర్కొన్నారు. నేను సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.