

జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూ భారతి కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్రఎస్ సి, ఎస్ టీ, మైనారిటీ, వికలాంగుల, శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ఆదేశాల మేరకు ఈరోజు నామపూర్, సుద్దపల్లి గ్రామాలలో నడుస్తున్న భూభారతి కార్యక్రమాన్ని ఎ ఎం సి చైర్మన్ రాములు గౌడ్ తహసీల్దార్ రవీందర్, డిప్యుటీ తహసీల్దార్ లాస్య శ్రీ, తో కలిసి పరిశీంచారు. అనంతరం రాములు గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరు తో 18వ కాలంలో ఉన్న అనుభవదారుల కాలం తొలగించి పెత్తందారులకు కొమ్మ కాచి నిజమైన రైతులకు అన్యాయం చేశారని అట్టి ధరణి పోర్టల్ లో పూర్తిగా సమస్య ఉండడం వల్లనే ధరణి ని తొలగించి రైతుల సమస్యలు తీర్చడానికి రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతి చట్టం తీసుకొచ్చారని అదేవిధంగా పూర్తి సమస్యలు పరిష్కరించడానికి గ్రామ గ్రామాన గ్రామ పరిపాలన అధికారులను నియమించిందని దరఖాస్తులు స్వీకరించి రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ చేయమని వివరించారు. గతంలో ఉన్న టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం వీఆర్వోలను తొలగించి రైతుల సమస్యలు మరింత పెంచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ కార్యక్రమంలోఆర్ ఐ లు శ్రీనివాస్ జమున సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి పవన్ రెడ్డి భరత్ రెడ్డి విక్రమ్ రెడ్డి అక్కనపల్లి నాంపల్లి కొల్లూరి రమేష్ శ్రీరామ్ అంజయ్య సింగసాని స్వామి నలువాల నరసమ్మ బలుసు మురళి పలువురు నాయకులు పాల్గొన్నారు.