

(జనం న్యూస్ చంటి జూన్ 12)
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలను ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి అందజేశారు మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ రోజు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఏకరూప దుస్తులు అందించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి వినియోగించుకొని కష్టపడి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు సంజీవ గౌడ్ మహేష్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి హరికృష్ణ సత్యనారాయణ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.