Listen to this article

జనం న్యూస్ 12కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లొ వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ, బేలా మండలంలొ గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ మండలం పిప్రిలో సౌరే గ్రామానికి చెందిన సిడం రాంబాయి, పెందూర్ మాధవ్ రావు, పెందూర్ సంజన, మంగు భీంబాయి, నలుగురు మృతి చెందగా వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిదంగా బేలా మండలం సంగడి గ్రామంలో పంట చేనులో విత్తనాలు నాటు తుండగా పిడుగు పడి గేడం నందిని( 45)ఫోన్ కాస్ట్ గ్రామంలో పంట చేనులో కోవ సునీత (38)పిడుగు పడి మృతి చెందింది.ఒకే రోజు ఆరుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు మృతులంతా గిరిజనులే సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.