Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారు.

చంద్రబాబు, లోకేశ్ చొరవతోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు.

ప్రజలు మరో 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికి మద్ధతు పలకాలి.

సుపరిపాలనకు ఏడాది వేడుకల్లో ప్రజలతో కలిసి పాల్గొన్న ప్రత్తిపాటి

కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై చేయివేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమని, అదే రాష్ట్రప్రగతికి ఇంధనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా పట్టణవ్యాప్తంగా జరిగిన మూడుపార్టీల విజయోవత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రత్తిపాటి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు వీధిసహా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన సంబరాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల చొరవ వల్లే రాష్ట్రానికి రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు.. ప్రజల సంతోషం, సంక్షేమంతో పాటు రాష్ట్ర పునరర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఇప్పటికే వారినాయకత్వంపై ఉన్న నమ్మకం, వారి చొరవ, భరోసాతోనే రూ.9.70లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఒక్క ఏడాదిలో ఏ ముఖ్యమంత్రి ఇంతభారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించలేదన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో, రాష్ట్రంలోని జనసేన, బీజేపీ శ్రేణుల తోడ్పాటుతో చంద్రబాబు రాష్ట్రప్రగతికోసం ఎంతో కృషిచేస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. తల్లికి వందనంతో 67,27,164 మంది విద్యార్థులకు మేలు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నేటినుంచే తల్లికి వందనం అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, 67,27,164 మంది విద్యార్థులకు మేలుచేసేలా నిర్ణయం తీసుకున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పథకంలో భాగంగా తమ బిడ్డల చదువుల కోసం తల్లుల ఖాతాలకు రూ.8745కోట్లు జమచేయనున్నారన్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నాక్యాంటీన్ల ఏర్పాటు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ సహా అనేక పథకాల్ని అమలు చేశారన్నారు. ఈ నెల 21 నుంచి అన్నదాతా సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాకు తొలివిడతగా రూ.7వేల ఆర్థికసాయం అందించనున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఆగస్ట్ 15న ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి అన్నిచర్యలు తీసుకున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని, ప్రభుత్వ పనితీరు చూసి తట్టుకోలేని కొందరు స్వార్థపరులు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రత్తిపాటి సూచించారు. జగన్ భూతం కుట్రలు..కుయుక్తుల్ని ప్రజలు తిప్పికొట్టాలి జగన్ భూతం రాష్ట్రప్రగతిని… ప్రజల సంతోషాన్ని జీర్ణించుకోలేకపోతోందని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ భూతం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు వైసీపీ కుయుక్తులు, కుట్రలను తిప్పికొట్టాలని, లేకుంటే రాష్ట్రం మరలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తుందని ప్రత్తిపాటి సూచించారు. ప్రజలు 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికే మద్ధతుపలకాలి.. చంద్రబాబు ఆలోచనల్ని, దూరదృష్టిని ప్రపంచమే కొనియాడుతోందని, ప్రధాని మోదీ కూడా మన ముఖ్యమంత్రిని అభినందించడం ఆయన పనితీరుకు నిదర్శనమని ప్రత్తిపాటి కొనియాడారు. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రుల్లో మన నాయకుడు ఒకరని, 75 ఏళ్లవయసులో ఆయన అవిశ్రాంతంగా రాష్ట్రంకోసం పనిచేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక, వారి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే చంద్రబాబు ఏకైక లక్ష్యమని ప్రత్తిపాటి చెప్పారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమిప్రభుత్వమే అధికారంలో ఉండాలన్న గట్టి పట్టుదలతో ప్రజలు ప్రజాప్రభుత్వానికి తమమద్థతు తెలియచేయాలని ప్రత్తిపాటి కోరారు. కూటమిప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకొని నేడు విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టిన అన్నిపార్టీల నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు, గ్రామ స్థాయి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.