

జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియ.
జైనూర్ :మండలంలోని పట్నాపూర్ గ్రామము యందు నేటి నుంచి పునః ప్రారంభం అయిన సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు మండల తహసీల్దార్ అడా బిర్సావ్ చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ చదవాలి,ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అని తెల్పారు వారితో పాటు ప్రధానోపాధ్యాయులు అరుణ రాజేంద్రప్రసాద్,గజానంద్ వంకీల నందు సరోజ ఇంద్రజ సురేఖ తదితరులు పాల్గొన్నారు