

జనం న్యూస్ జూన్ 12 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వివిధ పాఠశాలలు ప్రారంభాన్ని పురస్కరించుకుని చిలిపి చెడ్ మండలం విద్యాధికారి శ్రీ పి విట్టల్ మండలంలోని ప్రాథమిక, మరియు ,ఉన్నత పాఠశాలలో, విద్యార్థిని విద్యార్థులకు ఘన స్వాగతం పలకడం జరిగింది దాంట్లో భాగంగా సోమక్కపేట, ప్రాథమిక, మరియు ఉన్నతపాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ,పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీ విఠల్ సార్ గారు మాట్లాడుతూ అన్ని వసతులు, పేద విద్యార్థిని, విద్యార్థులు అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఉచిత నిర్బంధ విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనబడిని మనం బ్రతికించుకోవాలని ప్రవేటుపడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు అందరూ ప్రభుత్వ బడిలోనే చేరాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ కుమార్ సార్, యాదగౌడుసార్, మోహన్ సార్ , మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీను సార్, పండరీ సార్లు పాల్గొనడం జరిగింది