Listen to this article

జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


11 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారి అద్యక్షతన భారతీయ జనతా పార్టీ అమలాపురం బట్లపాలెం బి వి ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బట్లపాలెం,అమలాపురంలో వృత్తి నిపుణులు సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ నగర శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమ, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్,డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందంతో జిల్లా ట్రెజరర్ క్రింది నానాజీ పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల అధ్యక్షులు వివిధ వృత్తినిపుణులు మేధావులు బివిసి స్టాప్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు,రామచంద్రపురం నియోజక వర్గ బీజేపీ నాయకులు సలాది వీరబాబు తదితరులు పాల్గొని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని, కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారిని దుశ్శాలువాతో సత్కరించారు.కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావును అభినందిస్తూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సాల్వతో సత్కరించినారు