Listen to this article

ప్రదర్శనతో రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్

జనం న్యూస్,జున్ 13,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ బి,గ్రామంలో శుక్రవారం వ్యవసాయ క్షేత్రంలో విత్తన శుద్ధి అవగాహన రైతన్నల సమక్షంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోష్, నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి మాట్లాడుతూ కంది పంటకి తీవ్రంగా నష్ట పరిచే ఎండు తెగులు ఒకసారి పంటకి సోకితే తర్వాత ఎంత ఖరీదైన మందులు పిచికారీ చేసిన లాభం ఉండకుండా పోతుందని అన్నారు.కంది పంట ఎండు తెగుల నివారణకు కంది పంట ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల వరకు ట్రైకోడెర్మ,విరిడ్ జీవ శిలీంద్ర నాశిని తో విత్తన శుద్ధి చేసి ప్రత్యక్షంగా రైతులకు చూపించారు. విత్తన శుద్ధి విత్తనాలను ఎండు తెగులు వ్యాధి నుంచి ఎలా రక్షిస్తుందో, వ్యవసాయ దిగుబడిని పెంచడానికి ఎలా సహాయపడుతుందో ప్రదర్శనలో చర్చించారు. ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి మొలకెత్తే విత్తనాలను, మొలకలను నేలలోని హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది అని అన్నారు.ఇది ప్రారంభ ఏకరీతి పెరుగుదలకు సహాయపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత రైతులు తదితరులు పాల్గొన్నారు.