

జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఒకే ఒక్కడు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తం గా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నలబై నిమిషాల సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు, పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కేవలం ఒక్క వ్యక్తి మినహా రెండు వందల నలభై ఒకటి మంది మృతిచెందారు. విమానం మెడికోలు ఉంటున్న భవ నంపై పడటంతో వారిలో ఇరవై నాలుగు మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదు కు చేరింది. విమాన ప్రమాదం నుంచి నలబై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. అయితే, విమాన ప్రమాదం జరిగిన సమయంలో భయానక పరిస్థితుల గురించి విశ్వాస్ కుమార్ వెల్లడించారు. విశ్వాస్ మాట్లాడుతూ.. నేను దేవుడిని నమ్ముతా ను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నా ను అని పేర్కొన్నాడు. విమానం టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తరువాత పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఇదంతా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయిం దని విశ్వాసం చెప్పాడు.నేను చూసిన దాన్ని నమ్మ లేకపోయాను. ప్రమాదం జరిగిన వెంటనే నేను కళ్లు తెరిచి చూడగా.. నా చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. భయంతో నేను లేచి పరుగెత్తడం మొదలుపెట్టాను. నా చుట్టూ విమానం ముక్కలు ఉన్నాయి. అదే సమయం లో ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్సులో ఎక్కించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. నేను ఇరవై సంవత్సరాలుగా లండన్ లో నివసిస్తున్నా ను. నా భార్య, బిడ్డ కూడా లండన్ లో నివసిస్తున్నారు. వారు భయపడ్డారు. కానీ ఇప్పుడు నేను బతికే ఉన్నానని వారికి తెలుసు నని రమేష్ చెప్పాడు. తన సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని రమేష్ చెప్పాడు.విశ్వాస్ కుమార్ రమేష్ కు నలబై ఏళ్లు. విమా నంలోని పదకొండు ఎ సీటులో కూర్చొన్న విశ్వాస్.. అనూ హ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ బ్రిటన్ పౌరుడు. అతడు ఇరవై ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్నాడు. అతని భార్య, పిల్లలు కూడా లండ న్ లోనే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గుజరాత్ లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.