Listen to this article

జనం న్యూస్ ; 13 జూన్ శుక్రవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్

డిగ్రీ కళాశాల వ్యవస్థాపకసభ్యులు ఎడ్ల గురువారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి అన్న కుమారులు వెంకటరామిరెడ్డి, రామచంద్ర రావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పాపిరెడ్డి, కార్యదర్శి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి పాల్గొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులుగా, సిద్దిపేట తొలి శాసనసభ్యులుగా, డిగ్రీ కళాశాల వ్యవస్థాపక సభ్యులుగా వారు చేసిన కృషిని స్మరించుకున్నారు. చదువు విలువ తెలిసిన వారు కాబట్టే సిద్దిపేటలో డిగ్రీ కళాశాల స్థాపించుటకు కృషిచేసి ఈ ప్రాంతంలో లక్షలాదిమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుటకు తోడ్పడ్డారు అని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సునీత మాట్లాడుతూ గురువారెడ్డి వంటి ఆదర్శముర్తూలు అందరికీ ఆదర్శం వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ మధుసూదన్, డాక్టర్ గోపాల సుదర్శనం పిట్ల దాసు, సూపరిండెంట్ శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.