

జనం న్యూస్, జూన్ 14, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా , జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం లోని, యస్.స్సి. ప్రభుత్వ బాలుర వాసవి గృహం ముందు స్థానిక ప్రజలు, చెత్త చెదారం తో పాటు, ఆహార సంబంధిత వ్యర్థాలను చెత్త కుప్పలో పరవేయుచున్నారు. ఈ వ్యర్ధ పదార్థాల దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీటిపై వాలిన ఈగలు, దోమల ద్వారా, హాస్టల్ విద్యార్థులు, రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నందున, హాస్టల్ ముందు నుండి చెత్త కుప్పను తొలగించాలని, హాస్టల్ నుండి పాఠశాలకు వెళ్లే రోడ్డుమార్గం శిథిలమైపోయినందున, వర్షాలు పడినప్పుడు రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీళ్ళు నిలుచుటవలన, విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడినందున రోడ్డును సరిచేయాలని, అదే విధంగా వసతి గృహం వెనుక భాగంలో, విద్యుత్ స్తంభం వంగిపోయినందున, ప్రమాదం జరగక ముందే, విద్యుత్ స్తంభాన్ని కూడా సరి చేయాలని, సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి, హాస్టల్ పరిసరాలను, పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచు న్నారు.