

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు ప్రయోజనం చేకూరేలాగా సేవ, సుపరి పాలన, పేదల సంక్షేమం
వికసిత్ భారతదేశం లక్ష్యం….
ఈరోజు ఎయిడెడ్ స్కూళ్లలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 1,430 స్కూళ్లలో 2,55,718 మందికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కూటమి ప్రభుత్వం బిజెపి నాయకులు మండపేట జడ్పీ గర్ల్స్ హై స్కూల్ అందిస్తున్న “డొక్కా సీతమ్మ” మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలించి కోడి గుడ్లు, చీక్కీలు అందిస్తున్న స్కూలు యాజమాన్యానికి సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు భోజనం వడ్డించి నిత్య అన్నదాత డొక్కా సీతమ్మ పేరిట ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఈ మధ్యాహ్న భోజన పథకం.’విద్య భవిష్యత్కు బీమా’ అనే మాట. నేటి విద్యార్థులు భవిష్యత్లో అన్ని రంగాల్లో రాణించాలంటే వారికి పోషకాహారం కచ్చితంగా అందాలని భోజన నాణ్యత, శుభ్రత, మౌలిక వసతులు సూచనలు ఇచ్చామని ,డొక్కా సీతమ్మ పేరు ప్రతిష్ఠలను పెంచేలా విద్యార్థులు కూడా గుర్తించుకుంటారు. బిజెపి నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, మండపేట పట్టణ పూర్వపు కన్వీనర్ మద్దుల సుబ్బారావు, మల్లువలస రాజశేఖర్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
