Listen to this article

జనం న్యూస్ 14జూన్ పెగడపల్లి ప్రతినిధి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరం నందు మండల పరిధిలో గల పంచాయతీ కార్యదర్శులు, మరియు క్షేత్ర సహాయకులకు, మండల పరిషత్అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వన మహోత్సవము మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సమీక్షించారు. సమావేశంలో ఏపీవో అనిల్, ఈసీ రమాపతి, ఏఈ హౌసింగ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.