Listen to this article

జనం న్యూస్ జూన్ 13 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి వాణిశ్రీ ఆధ్వర్యంలో తుంగూరు అంగన్వాడి సెంటర్స్ లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు.
సిడిపిఓ వాణిశ్రీ మేడం మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడి స్కూల్ కి పంపించాలని ప్రీస్కూల్ విద్యా విధానంలో పిల్లలకు 80% వరకు వారి బ్రెయిన్ డెవలప్ అవుతుందనీ తెలియజేశారు.. రెండున్నర సంవత్సరానికి అలవాటు చేయాలని మదర్స్ ని కోరారు. సూపర్వైజర్ శైలజ మాట్లాడుతూ అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ సమయపాలన పాటిస్తూ తల్లుల యొక్క సలహాలను కూడా తీసుకొని వారు అంగన్వాడి సెంటర్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రీస్కూల్ పిల్లల సంఖ్య పెంచుకునేందుకు పిల్లల అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు .పూర్వ ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి సిలబస్ లో వున్న అంశాల గురించి వివరించారు. ప్రీస్కూల్ గురించి కొద్దిగా తెలుసుకున్న తల్లులందరూ తప్పకుండా అంగన్వాడి సెంటర్లకి మా పిల్లలందరినీ పంపిస్తామని వాళ్లు తీర్మానం చేసుకున్నారు. ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయని వాళ్ళు చెప్పారు. కొత్తగా నమోదు అయిన పిల్లలకు అందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు తల్లులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధర్మపురి ప్రాజెక్ట్ సి డి పి ఓ వాణిశ్రీ ,బీర్పూర్ సెక్టార్ సూపర్వైజర్ శైలజ ,ఎంఈఓ నాగభూషణం , స్కూల్ టీచర్స్ హేమలత,రజిత, జనార్ధన్,నారాయణరెడ్డి, అక్షయ్ వివో సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ రమ, లక్ష్మి, విజయలక్ష్మి పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.