

బీసీ సంఘము జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్..
జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )
కరీంనగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ కార్యాలయంలో సుపారింట్ండెంట్ నరసింహ స్వామి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రవేట్ విద్యా సంస్థలు చేస్తున్న అన్యాయాల పైన అనుమతి లేకుండా నడిపిస్తున్నటువంటి ప్రవేట్ స్కూల్ లను మూసివేయాలని అన్నారు.చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ
ఆకర్షణ అయినటువంటి టెక్నో, ఈ టెక్నో గ్లోబల్ సీబీఎస్ అనేటువంటి పేర్లు పెడుతూ విద్యార్థులను మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూన్నరన్నారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న అటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్ భీమ్ , సమీర్, సిద్దు, తెలంగాణ అంబేద్కర్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.