

జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )
పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వారి ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి పీ డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ హాజరయ్యారు. వారు ఇ సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జూలై 12,13 తేదీలల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి నాయకత్వం హాజరవుతున్నరన్నారు. ,బోధించడానికి ప్రొఫెసర్ లు,మేధావులు వస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా ప్రగతిశీల శక్తులు, ఉద్యమ సానుభూతి పరులు,శ్రేయోభిలాషులు విజయవంతంకై కృషి చెయ్యాలని కోరారు. క్లాసులల్లో ప్రధానంగా ప్రజల మధ్య ఏర్పడిన ఆర్ధిక అసమానతలు,ఉచిత విద్య,వైద్యం పట్ల పాలకవర్గాల నిర్లక్ష్యం వంటి అంశాలను చర్చించి ఉద్యమాలకు సన్నద్ధం అవుతాం అని మాట్లాడారు.అలాగే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా మాటలకే పరిమితం అవుతున్నాడన్నారు,పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు,ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చెయ్యకుండా చేతులు ఎత్తేయడం దుర్మార్గమైనదన్నారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం బకాయిలు విడుదల చెయ్యకపోతే విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఇ సందర్బంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చరణ్,దిరాజ్ వంశీ,విష్ణు,వేణు,రాహుల్,రాకేష్,విజయ్,ప్రణయ్,సాయి,సిద్ధు,తదితరులు పాల్గొన్నారు.