Listen to this article

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

జర్నలిస్టు పిల్లలకు ( ఉచిత విద్య ) రాయితీ కి 25-26 విద్య సంవత్సరం సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టియుడబ్ల్యూజే – ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ తెలిపారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సూపర్డెంట్ వి రమణ చారి ఉత్తర్వులు టీయూడబ్ల్యూజే నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ( ఉచిత విద్య ) రాయితీ కల్పించాలని ఈనెల 11వ తేదీన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కు విన్నవించామని ఈ నేపథ్యంలో విద్యా శాఖ జిల్లా అధికారి యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా వీరికి జిల్లా జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కొందరు ప్రైవేటు విద్యా సంస్థలవారు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటు పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టియుడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అడప సతీష్ తదితరులు పాల్గొన్నారు.