

పత్రిక విలేకరులను సంజయ్,సిటీ కేబుల్ రాకేష్,మాజీ ఎంపిటిసిని,ఇతర నాయకులను పరామర్శించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనముపై ప్రయానిస్తున్న సందర్బంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి విలేకరి సంజయ్ ని వారి గృహములో, విట్యాల మాజీ ఎంపీటిసి దేవిఅన్యనాయక్ నీ శివరాం నాయక్ హాస్పిటల్లో మరియు రియల్ ఎస్టేట్ షాద్నగర్ అధ్యక్షుడు రాజు గౌడ్ ని వారి వద్దకు వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆరాతీసి వారికి మనోదైర్యాని కల్పించి వైద్యని యొక్క సూచనలు పాటిస్తూ ఆరోగ్యాని జాగ్రత్తగా చూసుకోవాలనీ మనోదైర్యాని కల్పించారు. అలాగే సిటీ కేబుల్ రాకేష్ తండ్రి గారి అకాల మరణం పట్ల మరియు పట్టణంలోని విజయనగర్ కాలనీలోని చెన్నారెడ్డి తల్లిగారి అకాల మరణం పట్ల వారి ఇంట్టికి వెళ్లి మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారిని పరామర్శించారు.ఎమ్మెల్సి నవీన్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్స్ బీఆర్ఎస్ నాయకులు ఈశ్వర్ రాజు,బిఎస్ సుధీర్, రఘునాథ్ యాదవ్, నరేష్, దినేష్ సాగర్, అజ్జు,అషు భూమ్,సుధీర్, మధు రాజు తదితరులు పరామర్శించారు.
