Listen to this article

విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి !!

జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులకు సంబంధించి బస్సు పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ… టీజి ఆర్టీసీ డిపో మేనేజర్ కేవి. రాజశేఖర్ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈనెల 12 నుంచి పాఠశాలలు మరియు కళాశాలలు రీఓపెన్ అవుతున్న సందర్భంగా బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాదని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో నగరంలో విద్యార్థులకు సాధారణ నెల పాస్ రూ.400 రూపాయలు ఉంటే దానిని రూ.600 రూపాయలుగా పెంచారు. మరియు మూడు నెలల పాస్ రూ.1200 రూపాయల నుండి రూ.1800 రూపాయలకు పెంచడం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 లక్షల విద్యార్థులపై అదనపు భారాన్ని మోపడమే. నగరాలలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బస్సులను పెంచమంటే బస్ చార్జీలు పెంచడం ప్రభుత్వ నీతిమాలిన చర్య. కాబట్టి *పెంచిన అన్ని రకాల చార్జీలను వెంటనే తగ్గించాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో అన్ని బస్ డిపో ల ముందు ధర్నా లతో పాటుగా బస్ భవన్ ని కూడా ముట్టడిస్తాని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు కుశంగా హరిశ్చంద్రప్రసాద్, కార్తీక్ లు పాల్గొన్నారు.