

బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 13 (జనం న్యూస్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బేస్తవారిపేట మండలం బీసీ సెల్ విభాగం అధ్యక్షులుగా “మొగుళ్ళూరి భీమయ్య యాదవ్” అధికారికంగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా మొగుళ్ళూరి భీమయ్య యాదవ్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బేస్తవారిపేట మండలం బీసీ సెల్ అధ్యక్షులు గా నియామకం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు, నాపై నమ్మకంతో నన్ను సిఫార్సు చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. బేస్తవారిపేట మండలం వైసీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భీమయ్య యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.