

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి
సీతానగరం మండలం వెదుళ్ళపల్లి గ్రామదేవత అయిన వెదుళ్ళమ్మను భారతీయ జనతా పార్టీ రాజానగరం అసెంబ్లీ ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సొంత ఊరు గ్రామ దేవత ఆయన వెదుళ్ళమ్మను ఈ శుక్రవారం రోజున దర్శించుకోవడం జరిగిందని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందాలని, రైతులకు మంచి పంటలు పండి అధిక దిగుబడున రావాలని కోరుకోవడం జరిగిందని తెలియజేశారు.
