Listen to this article

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలిగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పశు సంచార వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. తాము 2022 నుంచి విధులు నిర్వర్తిస్తున్నామని, విధుల్లోకి రావద్దంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారని బాధితుడు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులపై కన్నెర్ర చేయొద్దన్నారు.