

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు
నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలో మాధవి అనే నాయి బ్రాహ్మణ మహిళ ను మంచినీళ్లు పట్టుకొనివ్వకుండా కులం పేరుతో దూషించి, అసభ్యకరంగా మాట్లాడి కుల వివక్షతకు గురిచేసి ఆమెను మానసికంగా ఇబ్బందికి గురిచేసి నందున ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీనివాసులు రెడ్డి పై నాన్ బెయిల్ బులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు పాత్రికేయుల సమావేశంలో నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులపై దాడులు హత్యలు అధికమైన దృష్ట్యా ప్రభుత్వం స్పందించి నాయి బ్రాహ్మణులకు ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ లాంటి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.