

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ మల్నాడు జిల్లా కలెక్టర్, చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని ఏడో వార్డు పరిధిలో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు ఈ రోజు 14-6-2025 శనివారం ఉదయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వూసా సుబ్బారావు ఆధ్వర్యంలో “మాక్ యోగడే” నిర్వహించడం జరిగింది విద్యార్థిని,విద్యార్థులకు వారి తల్లిదండ్రులకుయోగా విశిష్టత గురించి యోగాసనాలు గురించి వివరించడం జరిగింది. యోగ ప్రతిరోజు చేయడం ద్వారా వల్ల జరిగే ఉపయోగాల గురించి తెలియజేయడం జరిగింది. అనంతరం డ్వాక్రా మహిళలు విద్యార్థులతో యోగాసనాలు చేయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమం లో7వ వార్డు సచివాలయ సిబ్బంది, సాగర్ సురేష్ బాబు. అనిత.విజయ్, ఆశా సలోమి.మాధవి ఉపాధ్యాయులు .పోటు శ్రీనివాసరావు,పాల్గొన్నారు.