

విమాన ప్రమాద ఘటన బాధాకరం…
రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు
జనం న్యూస్ జూన్ 14 జిల్లా బ్యూరో
అహ్మదా బాద్ నుండి లండన్ వెళ్తున్న విమాన దుర్ఘటనలో అనేక మంది మరణించడం చాలా బాధాకరమని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు అన్నారు.ఈ సందర్బంగా విమాన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని లింగాపూర్ గ్రామం లో కొవ్యోత్తుల ర్యాలీ నిర్వహించి ప్రమాద మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఉపారపు సత్య రాజ్ మాట్లాడుతూ ప్రమాద ఘటన తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ సీ ఎం విజయ్ రూపానితో పాటు వందల మంది ప్రయాణికులు, మెడికల్ కళశాల విద్యార్థులు మృతి చెందిడం విచారకరమన్నారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, అలాగే వారికి నాణ్యమైన వైద్యం టాటా గ్రూప్ యాజమాన్యం అందించి పూర్తిగా ఆదుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.అనంతరం ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యక్రమంలో గ్రామ యువకులు గణేష్, రాహుల్, విజయ్, సునీల్,అనిల్,రాజ్ కుమార్, పవన్ తదితరులు ఉన్నారు