

జనంన్యూస్.14. సిరికొండ. ప్రతినిధి.
జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్ గౌడ్,బాలరాజ్,రాజు,కిషన్,రవి,మ హేష్,శేఖర్,రాజేశ్వర్, గోపాల్ తూంపల్లి యువకులను అభినందిస్తూ ప్రశంస పత్రాలు ఫౌండేషన్ వారు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానాన్ని గొప్ప దానంగా భావిస్తారు ఎందుకంటే ఒకరు ఇచ్చిన రక్తం ద్వారా ముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన ప్రాణం కాపాడడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే అది రోగి జీవితానికి ప్రాణాంతకం కావచ్చు కాబట్టి ప్రతి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి డి సి చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాజేందర్,రవి,ప్రశాంత్,యశ్వంత్, బాలరాజ్,అనిల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.