

రక్త దాతల దినోత్సవం సందర్భంగా రక్త దాతలకు సత్కారం
బిచ్కుంద జూన్ 14 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక సార్లు రక్త దానం చేసిన రక్త దాతలను సత్కారం చేసి రోగులను పండ్లు పంపిణీ చేశారు.
రక్త దానం యొక్క ప్రాముఖ్యత ను వివరించి రక్త దాతలు గా ఉన్న శ్రీనివాస్ రిపోర్టర్, రచ్చ శివకాంత్, ముత్యాల సందీప్, పిండ్కులవార్ శివకుమార్, బాలరాజ్, లను మరియు రక్త దాత గా ఉంటూ తన తండ్రి మరణాంతరం తండ్రి గంగారం పార్థివ దేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల కు దానం చేసిన చిల్లెల సాయిలు మరియు వైద్య సిబ్బంది విజయ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ బిచ్కుంద చైర్మన్ కోలా వార్ కుమార్ సేట్, వైస్ చైర్మన్ రచ్చ శివకాంత్, రెడ్ క్రాస్ సభ్యులు హనుమా గౌడ్, డా నర్సింలు, సంతోష్, హుండె బస్వరాజ్, ఆసుపత్రి సిబ్బంది పూజ, పవన్ కుమార్, లక్ష్మి, శివ, అశోక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
