Listen to this article

జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కెపిహెచ్బి కాలనీ 3వ ఫేస్ రమ్య గ్రౌండ్స్ లో వాసుదేవుడు ఆహ్వానం మేరకు మన కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్,జస్టీస్ భవానీ ప్రసాద్, మిరియాల రాఘవ రావు, వాకాడ తిరుమలరావు, బసవాల శ్రీనివాస్, అంధే శ్రీరామ్ మూర్తి,యర్రా ఆనందరావు,దాసరి రంగారావు,మోటెపల్లి భరత్,హెచ్న్ మూర్తి, వుచా రాంబాబు ముఖ్య అతిధులుగా హాజరై మొక్కలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఉచితముగా పది వేల పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు రక్తదాన కార్యక్రమాలు ఎంతో స్పూర్తినీ ఇచ్చే కార్యక్రమాలు అని, ఇంకా మరేన్నో సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని వాసుదేవుడు మరియు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్” వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు మరియూ మెగా అభిమానులు తధితరులు పాల్గొన్నారు.