Listen to this article

రక్తదాన దినోత్సవ శిబిరంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

జనంన్యూస్. 14. నిజామాబాద్ రూరల్

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్ , ఉమ్మాజీ నరేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన ఏర్పడింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదేనని ఇ లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కోసమే కాకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కార్యక్రమాన్ని చూస్తుంటే రూరల్ కాంగ్రెస్ యువజన నాయకులు పార్టీ కోసమే కాకుండా మానవత్వంతో ఆలోచించి రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమని ఆయన వారి సేవలను ప్రశంసించారు. వారికి ఎప్పుడూ ఆ భగవంతుడి కృప, ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. అదేవిధంగా పార్టీ కోసం రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూనే ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు భూపతి రెడ్డి వెల్లడించారు.. అంతర్జాతీయ రక్త దినోత్సవ సందర్భంగా 30 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం అభినందనీయమన్నారు. పార్టీని విస్తృతంగా బలపరుస్తూనే యువజన కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మానవతా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంపల్లి మహేందర్, ఉమ్మజీ నరేష్ లు సంయుక్తంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేసి ఆదుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. చాలామంది యువత వివిధ ప్రమాదాల్లో పడినప్పుడు రక్తస్రావం ఎక్కువగా అవుతుందని, అటువంటివారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తదానం చేయడం వల్ల ఒక మనిషిని బ్రతికించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, పార్టీ కార్యకర్తలకు యువజన నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకాశ్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినోద్ , బైండ్ల ప్రశాంత్,వంశీ, వెంకటేష్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.