

జనం న్యూస్ జూన్ 14:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎస్ డి ఏఫ్ నిధుల కింద రూ 10 లక్షలు మంజూరు చేయించినందుకు శనివారం రోజునా మోర్తాడ్ ప్రజా నిలయంలో ఎస్సీబీసి కమిటీ అధ్యక్షుడు భీమానావోయినా చిన్న ఆశన్న మరియు సభ్యులు ముత్యాల సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలోఏర్గట్ల మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఆడేం గంగప్రసాద్, ఎస్సీ బీసీ కమ్యూనిటీ సభ్యులు మగ్గిడి దేవదాస్, లింగాల సత్యనారాయణ గౌడ్, పోతుగంటి బక్కన్న, శివరాత్రి ఊశన్న,లక్కం సాయన్న, గంగరపు శ్రీనివాస్, మగ్గిడి నరేష్, నవీన్,లింబాద్రి,దేవేందర్,రాహుల్ కాంగ్రెస్ నాయకులు గుండేటి చంద్రశేఖర్, బెజ్జరాం భాను చందర్ పాల్గొన్నారు.