

సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన
గోమాతకు ప్రత్యేక పూజలు
జనం న్యూస్, జూన్ 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయం 37 వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు, ముందుగా సుప్రభాత సేవ అమ్మవారికి పంచామృత అభిషేకాలు గోమాతకు పూజలు అనంతరం అమ్మవారికి 54 లీటర్ల పాలతో అభిషేకం అనంతరం సామూహిక వాసవి పారాయణం కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదమంద చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్,పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయం గజ్వేల్ పట్టణంలో నిర్మించి 37 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ కరుణాకటాక్షాలు ఉంటాయని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శంకర్ పంతులు,ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య, ఎర్రం శ్రీనివాస్, భద్రయ్య, నేతి శ్రీనివాస్, ఎన్ సీ సంతోష్, ఉప్పల కృష్ణమూర్తి, గంగిశెట్టి వెంకటేశం,మరియాల శ్రీనివాస్ గంగా రమేష్, సిరిపురం సత్యనారాయణ, సిద్ది నవీన్,కైలాస ప్రశాంత్ ఉమేష్,శ్రీహరి, ఉప్పల చంద్ర శేఖర్, గందే సంతోష్, వాసవి క్లబ్,సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

